బిగ్ బ్రేకింగ్: సుషాంత్ ఇంట మ‌రో విషాదం

బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ సోమ‌వారం ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా ఆ ఘ‌ట‌న జ‌రిగి ఇంకా 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే సుషాంత్ ఇంటి మ‌రో విషాదం చోటు చేసుకుంద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. సుషాంత్ ఆక‌స్మిక‌ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌ ఆయ‌న వ‌దిన (క‌సిన్ బ్ర‌ద‌ర్ భార్య‌) బీహార్ లోని పూర్ణియాలో సోమ‌వార‌మే క‌న్నుమూసిన స‌ఘ‌ట‌న నేటి ఉద‌యం వెలుగులోకి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. సుషాంత్ మ‌ర‌ణ వార్త విన్న వ‌దిన‌మ్మ అప్ప‌టి నుంచి నీరు, ఆహారం మానేసిన‌ట్లు స‌మాచారం. బిహార్ లో ఇంట్లోనే ఉన్నారు. ఇటు కుటుంబ స‌భ్యులంతా సుషాంత్ అంత్య‌క్రియ ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు.

దీనిలో భాగంగా అంద‌రూ ముంబైకి త‌ర‌లివ‌చ్చారు. ముంబైలోని ప‌వ‌న్ హ‌న్స్ శ్మ‌శాన వాటిక‌లో కుటుంబ స‌భ్యులు, ప‌రిశ్ర‌మ‌కు చెందిన అతికొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో సుషాంత్ అంత్య‌క్రియ‌లు పూర్తిచేసారు. అయితే ఈస‌మ‌యంలోనే సుషాంత్ వ‌దిన బీహార్ లో తుది శ్వాస విడిచిన‌ట్లు తెలుస్తోంది. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డం..ఆమె మాన‌సిక స్థితిన అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డం కార‌ణంగా సుషాంత్ ఫ్యామిలీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యం నిన్న మీడియాకు లీక్ అవ్వ‌లేదు. నేటి ఉద‌య‌మే న్యూస్ బ‌య‌ట‌కు రావ‌డంతో సంచ‌ల‌న‌మైంది. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు కావాల‌నే దాచిపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఒకే రోజ..ఒకే ఫ్యామిలీలో రెండు మ‌ర‌ణాలు అంటే! మీడియా అంత‌కంత‌కు వేడెక్కిస్తుంద‌నే విష‌యాన్ని దాచిపెట్టిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టికే సుషాంత్ మ‌ర‌ణంతో కృంగిపోతున్న ఆ ఫ్యామిలీకి వ‌దిన‌మ్మ మ‌ర‌ణం మ‌రింత బాధ‌కు దారి తీసింది. సుశాంత్ మ‌ర‌ణం తో ఇటు అభిమానులు..అటు కుటుంబ స‌భ్యులు శోక సంద్రంలో మునిగిన వేళ‌ మ‌రో చేదు వార్త అభిమానులు జీర్ణించుకోలేనిదే.