వదిన కోసం ఏకంగా కట్టుకున్న భార్యను హతమార్చిన భర్త?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు తప్పు అని తెలిసి కూడా చాలామంది విడిచి పెట్టడం లేదు. వివాహేతర సంబంధాల వల్ల ఇప్పటికే చాలామంది బలయ్యారు. కొంతమంది అయితే వావి వరసలు మరిచి మరి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు సమాజంలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల రోజు ఏదో ఒక ప్రదేశంలో ఒక ప్రాణం బలి అవుతూనే ఉంది. తాజాగా బీహార్ లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తల్లిలా భావించాల్సిన వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని, కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఒక భర్త. అసలు విషయంలోకి వెళ్తే…

బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాలో బదర్ అనే గ్రామంలో ఒక వ్యక్తి తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే వారి బంధానికి తన భార్య అడ్డొస్తుందన్న కారణంతో ఏకంగా ఆమెను చంపేసి పొలాల్లో పడేశాడు. ఆ గ్రామంలో ఒక వరి పొలంలో ఒక వివాహిత మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆమె ఒంటిపై ఉన్న గాయాల ఆధారంగా ఆమెను ఎవరు ఉరేసి చంపి అనంతరం మృతదేహాన్ని పొలాల్లో పడేశారని పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న అజయ్ అనే ఒక వ్యక్తి ఆ మృతదేహం తన కూతురిదే అని పోలీసులకు తెలిపాడు.

అయితే అత్తారింట్లో భర్తతో సంతోషంగా ఉండాల్సిన తన కూతురిని ఇలా చూసేసరికి ఆ తండ్రి గుండె పగిలేలా రోదించాడు. అజయ్ తన అల్లుడు పై అనుమానం ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఆ వివాహిత, ఆమె భర్తతో పాటు ఆమె ఇంట్లో అతని వదిన కూడా ఉండేది. అతడి వదిన పోస్ట్ మాస్టర్ గా పని చేస్తుండగా..అతను అదే పోస్ట్ ఆఫీస్ లో పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే వదిన మరిది మధ్య చదువు పెరిగి,వావి వరసలు మరచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇదే విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె నిలదీసింది. దీంతో అతను ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లి పోవచ్చని భార్యకు తేల్చి చెప్పడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒకటే ఇంట్లో ఉంటున్న ఆ వదిన మరిది వివాహేతర సంబంధం కొనసాగించారు. ఆ తర్వాత భార్య కోసం వెళ్లి అలాంటి తప్పు చేయను అని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆ వివాహితను అతనితో పంపించారు. అప్పటి నుంచి కొద్ది రోజులు బాగానే ఉన్నా అతడు మళ్ళీ తన వదినతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. వారిద్దరికీ ఆమె అడ్డొస్తుందనీ భావించి వదిన మరిది కలిసి ప్లాన్ వేసి ఆమెను చంపి పొలాల్లో పడేసారు.