కేసిఆర్ బాటలో చంద్రబాబు ‘‘రాజశ్యామల యాగం’’ (వీడియోలు)

ఎపి సిఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సిఎం కేసిఆర్ బాటలో అడుగులు వేస్తున్నారు. వీరిద్దరికీ మార్గదర్శకుడు రాజుల కాలం నాటి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన బాటలో కేసిఆర్ నడిచారు. ఇప్పుడు బాబు కూడా నడుస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.

చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు రాజశ్యామల యాగం చేశారు. తన అధికారం పదిలపరచుకునేందుకు ఆ చక్రవర్తి రాజశ్యామల యాగం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత దక్షిణ భారతదేశంలో ఇంకెవరూ రాజశ్యామల యాగం చేసినట్లు ఆనవాళ్లు లేవు.

అయితే తెలంగాణ సిఎం కేసిఆర్ మొన్న నవంబర్ లో ముందస్తు ఎన్నికలకు కొద్దిరోజులకు ముందు తన ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం చేశారు. ఈ యాగం చేయాలని కేసిఆర్ కు శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఉపదేశించారు. దీంతో ఆయన ఆదేశానుసారం కేసిఆర్ యాగం చేశారు. ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ ఎన్నికలు మగిసిన వెంటనే కేసిఆర్ తన దేశ పర్యటనలో భాగంగా విశాఖటప్నం వెళ్లి స్వరూపానంద సరస్వతికి సాస్టాంగ ప్రణామాలు చేసి ధన్యవాదాలు తెలిపి ఒడిషా వెళ్లిపోయారు.

ఇప్పుడు చంద్రబాబు కూడా యాగాల బాట పట్టారు. ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణుస్వామి ఉపదేశాన్ని అంగీకరించిన చంద్రబాబునాయుడు కూడా రాజశ్యామల యాగం చేయించారు. గుంటూరు జిల్లాలోని చీరాలలో వేణుస్వామి రాజశ్యామల యాగం చేశారు.  చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే ఈ రాజశ్యామల యాగం చేశారు. ఆ యాగం చేసిన తర్వాత యాగ ఫలాన్ని తీసుకుని చంద్రబాబు వద్దకు వచ్చి ఆశీర్వదించారు. వాటికి సంబంధించిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.