అక్టోబర్ 16 నుంచి శబరిమలలో పూజలు !

దేశంలో ప్రఖ్యాతి గాంచిన శబరిమల శ్రీఅయ్యప్ప దేవాలయంలో అక్టోబర్ 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమం కానున్నట్లు ట్రావెన్‌కోర్‌ బోర్డు ప్రకటించింది.

Worship in Sabarimala from October 16
Worship in Sabarimala from October 16

అక్టోబర్‌ 16 నుంచి ఐదు రోజులపాటు అంటే అక్టోబర్‌ 20 వరకు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తారు. బుక్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని బోర్డు ప్రకటించింది. గరిష్ఠంగా రోజుకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. భక్తులు పంబకు చేరుకోవడానికి 48 గంటల ముందు పొందిన కోవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది.