Mangalsutra: పెళ్ళైన స్త్రీ మంగళ సూత్రాన్ని ఎందుకు ధరించాలి.. దాని వెనుక ఉన్న కారణం ఇదే!

వివాహం అనంతరం స్త్రీలు తప్పకుండా కొన్ని రకాల ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళసూత్రం ఒకటి. అయితే స్త్రీలు పెళ్లి తర్వాత కేవలం మంగళసూత్రం మాత్రమే కాకుండా బొట్టు కాలికి మెట్టెలు లాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళ సూత్రం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ధరించడం కూడా వివాహానికి చిహ్నంగా పరిగణిస్తారు.

అలాగే ఈ మంగళసూత్రం స్త్రీకి వివాహానికి సంకేతంగా పరిగణించబడుతుంది. వివాహాం అనంతరం మంగళసూత్రం ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతారు. మంగళసూత్రం అనేది వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బంధించి ఉంచే బలమైన సాంప్రదయంగా నమ్మకం. వివాహాం అనంతరం స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం పదహారు అలంకారాలను చేసుకోవాలని హిందూ మతంలో ఒక నమ్మకం. ఇందులో మంగళసూత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మంగళసూత్రం వివాహిత స్త్రీలను చెడు ద్రుష్టి నుంచి రక్షిస్తుంది. కాగా శాస్త్రాల ప్రకారం వివాహం తర్వాత శివ పార్వతులు వివాహిత జంటను రక్షిస్తారు.

మంగళసూత్రాన్ని ఎక్కువ మంది పసుపు దారంతో తయారు చేస్తారు. మంగళసూత్రంలో పసుపు రంగు ఉండటం కూడా ముఖ్యం. నలుపు రంగు పూసలు పసుపు దారంలో వేయబడతాయి. నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నమని చెబుతారు. అటువంటి పరిస్థితిలో నల్ల పూసలు స్త్రీలను, వారి జీవిత భాగస్వాములను చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి. పసుపు రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఇది వివాహ బంధాన్ని దీర్ఘకాలం కొనసాగేలా చేయడంలో సహాయపడుతుంది. మంగళసూత్రంలోని పసుపు రంగు పార్వతి దేవిని సూచిస్తుంది, నలుపు పూసలు శివుని సూచిస్థాయి. అలాగే మంగళసూత్రంలో 9 పూసలు ఉంటాయి. ఇవి 9 రకాల శక్తిని సూచిస్తాయి. ఈ శక్తులు భార్య, భర్తలను చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి. ఈ పూసలు గాలి, నీరు, భూమి, అగ్ని వంటి మూలకాల శక్తిని కలిగి ఉన్నాయని కూడా అంటారు. ఇవి భార్య భర్తల మధ్య సంబంధాన్ని బలంగా ఉంచడంలో సహాయపడతాయి.