జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే ఈ దేవుణ్ణి పూజించాలి..?

Bro4u-puja

సమాజంలో ఉన్న ప్రజలందరూ వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడతారు. అయితే కష్టపడి పనిచేయటమే కాకుండా దేవుడి ఆశీస్సులు ఉండటం వల్ల జీవితంలో అనుకున్నది సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అయితే ఏ దేవుణ్ణి ఎలా పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా ఎటువంటి శుభకార్యాలు పూజా కార్యక్రమాలు చేసినా కూడా మొదటగా విగ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఎందుకంటే పూజలో ప్రధమ దైవంగా భావించే విగ్నేశ్వరుడిని ముందుగా పూజించాలి. అలాగే మనం చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై పనులు నెరవేరకపోతే విఘ్నేశ్వరుడిని పూజించాలి. ఇలా అనుకున్న పనులు నెరవేరి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే సంకాష్టహర చతుర్దశి రోజు ఆ విగ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఇలా చేయటం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
సర్వ కష్టాలను దూరం చేసి ఆ సంకష్టహర చతుర్దశి పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సంకష్ట చతుర్దశి పూజ ప్రతినెల కృష్ణపక్షంలో పౌర్ణమి వెళ్లిన నాలుగవ రోజైన చతుర్దశి రోజు చేయాలి. ఈ రోజున విఘ్నేశ్వరునికి 32 స్వరా రూపాలలో చివరిదైనా సంకష్ట రూపం విఘ్నేశ్వరికి ఎంతో ఇష్టం. అందువల్ల ఆ రోజున విగ్నేశ్వరుని పూజిస్తే ఎటువంటి సమస్యకైన పరిష్కారం లభిస్తుంది. బహుళపక్షంలో చతుర్దశి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసే నీటిలో నువ్వుల గింజలు వేసి వాటితో స్నానం చేయాలి. ఎర్రటి గుడ్డ ముక్క తీసుకొని పసుపు, కుంకుమ వేసి మూడు దోసెలతో బియ్యం వేసి రెండు తాంబూలాలు, దక్షిణ, ఖర్జూరాలు వేసి స్వామీ కి ముడుపు కట్టాలి.

ఆ తర్వాత స్వామి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ముడుపును సమర్పించే ముందు కోరికను బలంగా కోరుకుని సమర్పించాలి. ఇక ఈ పూజ చేసేవారు ఉపవాసం ఉండాలి. అలాగే సాయంత్రం వేళ మళ్లీ తల స్నానం చేసి ఇప్పుడు వ్రతన్ని మొదలుపెట్టాలి. మొదట ఉదయం కట్టిన బియ్యంతో సాయంత్రం వేళ పాయసం, 21 కుడుములు చేసి ప్రసాదంగా సమర్పించాలి. ఈ పూజలో మొదటిగా పసుపుతో వినాయకుడిని గౌరీని చేసుకొని మొదలుపెట్టాలి. ఈరోజు కచ్చితంగా బ్రహ్మచర్యము పాటించాలని పండితులు చెబుతున్నారు.