శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు… అష్టైశ్వర్యాలు మీ వెంటే!

the details of thomala seva for sri venkateswara swamy in 2020 th year

మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం నిరంతరం మనపై ఉంటుందని ప్రజల నమ్మకం. ఇక కలియుగ దైవంగా భావించి శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించటం వల్ల వేంకటేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం చేసే దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పువ్వులతో అలంకరించాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి. ఇక స్వామి వారికి ఈటమైన పండ్లు, ఫలాలు, చెక్కెర పొంగలి,పాయసం, గారెలు పులిహార, కలకండ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి
తో దీపం వెలిగించాలి. పూజా సమయంలో ” ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వేంకటేశ్వరుడిని ఆరాధించాలి. ఆ తరుత స్వామీ వారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి.

ఇలా శనివారం పిండి దీపంవెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసే వరుసనివారం ఎలాంటి నీచు ముట్టుకోకుండా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇక శనివారం.సాయంత్రం వేళలో కూడా స్వామీ వారికి దీపారాధన చేసి పారాయణం చేయాలి. ఆ తరువాత ఉపవాస దీక్ష విరమించవచ్చు.