ఆ ఆలయంలో ప్రసాదం తింటే కష్టాలు కచ్చితంగా తీరతాయట.. ఆ ఆలయం అద్భుతమంటూ?

మనలో ప్రతి ఒక్కరినీ ఎన్నో కష్టాలు ఇబ్బందులు పెడుతుంటాయి. కొన్ని కష్టాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉండగా మరికొన్ని కష్టాలు మాత్రం ఎంత ప్రయత్నించినా పరిష్కారం కావు. అయితే ఒక ఆలయాన్ని దర్శించుకుని అక్కడ ప్రసాదం తింటే మాత్రం కష్టాలు తీరతాయని చాలామంది భావిస్తారు. యూపీలో భైరో బాబా ఆలయం దర్శించుకోవడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని చాలామంది ఫీలవుతారు.

కొంతమంది ఈ ఆలయాన్ని తిలస్మి దేవాలయం అని కూడా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలో దేవుడిని పూజిస్తే మాత్రం కచ్చితంగా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం ఆలయం కాగా ఆదివారం, మంగళవారం, శనివారంలలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువమంది భక్తులు ఆసక్తి చూపుతారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు వస్తారు.

భలే, ధర్, ఇమర్తి పేర్లతో ఉండే ప్రసాదాలను ఈ ఆలయంలో ప్రధానంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రసాదాలలో కొంత మొత్తాన్ని బాబా పాదాల చెంత సమర్పించడం ద్వారా దేవుని అనుగ్రహం కచ్చితంగా కలుగుతుందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నిత్యం కష్టాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.