జీతం వచ్చిన వెంటనే ఈ చిన్న పని చేస్తే చాలు.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచి వెళ్లదు!

 

సాధారణంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ఎంతో కష్టపడి పని చేస్తూ నెలకు నాలుగు రాళ్లు సంపాదించుకుంటూ ఉంటారు. అయితే మనం ఏ పని చేసిన అందరూ కూడా జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా నెల రోజున మనకు జీతం కనుక అందితే ఆ జీతం డబ్బులతో ఇలా కనుక చేస్తే ఒక లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపైనే ఉంటాయి. జీతం అందుకున్న వెంటనే అందులో కొంత డబ్బును దానధర్మాలకు ఉపయోగించడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇలా దానధర్మాలు మంచిది కదా అని జీతంలో ఉన్న డబ్బును ఎక్కువగా దానధర్మాలకు ఉపయోగించకూడదు. మన జీతంలోని కొంత డబ్బును ఉపయోగించి పేదవారికి వస్త్ర దానం చేయడం,గోమాతకు పిండితో తయారుచేసిన రొట్టెలను తినిపించి కాస్త నీళ్లు తాపించడం కూడా ఎంతో మంచిది.అదేవిధంగా మన ఇంటి దగ్గరకు వచ్చే పిట్టలకు పక్షులకు కాస్త గింజలు వేసి నీళ్లు పెట్టడం కూడా శుభపరిణామంగా భావిస్తారు.

 

ఇలా మన జీవితంలోని కొంత డబ్బును పక్షులకు ఆవుకు పేదలకు దానం చేయడానికి కాస్త డబ్బును ఉపయోగిస్తే చాలు.సకల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండేలా చేస్తాయి.ఇలా మన జీవితంలో ఒక శాతం వీటి ఖర్చులకు ఉపయోగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇక దానం చేయడం మంచిది కదా అని ఇంట్లో ఖర్చులను భార్య పిల్లలను కూడా పట్టించుకోకుండా దానధర్మాలు చేయడం మూర్ఖత్వం. అయితే జీతం పడిన వెంటనే ఇలా చిన్నచిన్న దానధర్మాలు పక్షులకు తిండి నీటిని పెట్టడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మన పైన ఉంటాయి.