వాస్తు దోషాలు దుష్టశక్తులను తరిమికొట్టేందుకు వీటితో ఇలా చేస్తే చాలు..?

సాధారణంగా మనిషి జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే కొందరి జీవితంలో మాత్రం నిత్యం సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ఇలా నిత్యం సమస్యలు వెంటాడటానికి ఇంటి వాస్తు దోషం లేదా దుష్టశక్తులు కూడా కారణం కావచ్చు. వీటివల్ల కుటుంబంలో తరచూ ఆర్థిక సమస్యలు తలెత్తటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి. తరచూ ఇలాంటి సమస్యలు ఉంటే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో పరిహారం చేయటం వల్ల ఈ సమస్యల నుండి విముక్తి పొందవచ్చి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులకు పారద్రోలటానికి ఉప్పు, ఎండు మిరపకాయలతో పరిహారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులు ఇంట్లో ఉన్నాయని చెప్పేందుకు ఉదాహరణలుగా భావించవచ్చు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే రాళ్ల ఉప్పు, నాలుగు ఎండు మిరపకాయలు, ఒక నిమ్మపండు, ఒక గాజు గిన్నె తీసుకోవాలి. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును నింపాలి. తరువాత ఒక నిమ్మ పండును రాళ్ల ఉప్పుపై ఉంచాలి. తరువాత నాలుగు ఎండు మిరపకాయలను ఉప్పుకు నాలుగు వైపులా నిలబెట్టాలి. ప్రతి మంగళవారం రోజున ఇలా చేయటం వల్ల ఎండు మిరపకాయల చివర్లు ఇంట్లోని ప్రతికూలతలను, దుష్ట శక్తులను తొలగిస్తాయి. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. మనం చేపట్టిన పనులు నిర్వేగ్నంగా పూర్తి అవ్వడమే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి కష్టాలనుండి విముక్తి లభిస్తుంది.