శివుడి అనుగ్రహం పొందాలంటే శివరాత్రి లోపు ఈ వస్తువులలో ఒక్కటి కొన్న చాలు?

శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగను పురస్కరించుకొని శివాలయాలు శివనామస్మరణతో మారు మోగిపోతూ ఉంటాయి. ఇలా మాఘమాసం మొత్తం శివుడికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.ఈ విధంగా శివుడి అనుగ్రహం పొందాలంటే శివరాత్రి లోగా శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే శివరాత్రి రోజు పూజ చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మరి శివరాత్రి లోపు ఏ ఏ వస్తువులను కొనుగోలు చేయాలి అనే విషయాన్ని వస్తే…

పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడి విగ్రహాన్ని కొనుగోలు చేయడం ఎంతో మంచిది.మన ఆర్థిక స్తోమతను బట్టి వెండి నంది విగ్రహాన్ని తీసుకువచ్చి శివరాత్రి రోజు శివలింగంతో పాటు నందీశ్వరుడికి పూజలు చేయాలి. అనంతరం ఈ నందీశ్వరుడిని మనం ఎక్కడైతే డబ్బులు భద్రపరుస్తాము ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం మన పై ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తారు.ఇక ఏకముఖ రుద్రాక్ష అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరం ఇలా ఏకముఖ రుద్రాక్షను తీసుకువచ్చి గంగాజలంతో శుద్ధి చేసి శివుడి మంత్రాన్ని చదివి ధరించాలి.

ఈ విధంగా శివరాత్రి రోజు ఏకముఖ రుద్రాక్షని ధరించడం ఎంతో శుభసూచకం. ఇలా చేయటం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.ఇక శివరాత్రి రోజు రత్నాలతో తయారు చేసిన శివలింగాన్ని కొనుగోలు చేసి అభిషేకాలు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు మన దరి చేరవు. ఇక శివరాత్రి రోజున పరమేశ్వరుడికి రాగి చెంబులోని నీటితో అభిషేకం చేయడం ఎంతో మంచిది కనుక శివరాత్రి రోజున కలశాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో శాంతి నేలకొనడమే కాకుండా మనల్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుందని విశ్వసిస్తారు.