అమావాస్యనాడు ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టవంతులు అవుతారట.. ఏం చేయాలంటే?

benifits of pooja to hanuman with flowers

ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు కావాలి అని భావిస్తూ ఉంటారు. తమకు అన్ని కలిసి రావాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు. అలా అన్ని కలిసి రావడం కోసం చాలామంది సొంత బలం కాకుండా దైవ బలాన్ని నమ్ముతూ ఉంటారు. చాలా వరకు దైవబలం అనేది అదృష్టానికి బాగా కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్ని పర్వదినాలలో దైవ పూజ చేస్తే అదృష్టం వెంట ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

ముఖ్యంగా అమావాస్య రోజులలో పూజలు చేస్తే మాత్రం అదృష్టం వెంట ఉండటం ఖాయం. కాబట్టి మీకు కూడా ధనప్రాప్తం, ధనయోగం కలగాలన్న, అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు కావాలన్నా ఆదివారం అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని కొన్ని పువ్వులతో పూజ చేస్తే కచ్చితంగా ఫలితాలు కలుగుతాయి. అమావాస్య ఆదివారం రోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుని గడపను కూడా శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పిండిలతో ముగ్గు వేయాలి.

 

ఇంటిని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవడం మంచిది. ఇక 108 మల్లెపువ్వులను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అంతేకాకుండా మల్లెపూల దండ లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి. ఇక ఒక్కొక్క అమ్మవారి పేరుకు ఒక్కొక్క మల్లెపువ్వు అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి పాలతో తయారుచేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి.

 

హారతి ఇచ్చేటప్పుడు అందులో 21 లవంగాలు వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది. ఇలా ప్రతి అమావాస్యకు చేస్తే మంచి ఫలితాలు అందుతాయి. అంతేకాకుండా గోమాతకు ఆహారం తినిపించడం వల్ల అష్టా ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందుతాయి. ఎక్కడైనా అన్నదానం చేసే ప్రదేశంలో ఆకుపచ్చని కూరగాయలే కాకుండా అక్కడికి కావలసిన ఆహార పదార్థాలను దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు ఎప్పుడు కుంకుమ బొట్టు ను, నల్లపూసలని ధరించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం ఉంటుంది అని తెలుస్తుంది.

అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఆదివారం అమావాస్యనాడు ఈ పూలతో అమ్మవారిని పూజించాలి