ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే మాత్రం కోటీశ్వరులు కావడం గ్యారంటీ.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించాలని జీవితాంతం సుఖంగా ఉండాలని భావిస్తారు. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మనపై దేవుని అనుగ్రహం ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లోని పూజగదిలో కొబ్బరికాయను ఉంచితే మంచిది. కొబ్బరికాయకు పసుపు, కుంకుమ పూసి పూజగదిలో ఉంచితే అనుకూల ఫలితాలు వస్తాయి.

లక్ష్మీదేవిని పూజించే సమయంలో పద్మాన్ని సమర్పించడం ద్వారా కూడా మనపై దేవుని అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవిని పద్మాలతో పూజించడం ద్వారా ఆర్థిక భద్రత , స్థిరత్వం ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో కొద్దిగా కర్పూరం ఉంచడం ద్వారా కూడా దేవుని అనుగ్రహం మనపై ఉండటంతో పాటు శుభ ఫలితాలు వస్తాయి. ఇంట్లో కచ్చితంగా కర్పూరంను కచ్చితంగా పెట్టుకుంటే మంచిది.

అదే సమయంలో కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు. వాస్తు ప్రకారం తాజ్ మహల్ ఫొటోను ఇంట్లో పెట్టుకోకూడదు. ఈ ఫోటో నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇంట్లో మహాభారతం ఫొటోలు, పుస్తకాలను ఉంచుకోవడం మంచిది కాదు. వాడిపోయిన పూలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా నెగిటివ్ ఫలితాలు వస్తాయి.

ఇంట్లో విరిగిపోయిన, పగిలిపోయిన విగ్రహాలను అస్సలు పెట్టుకోకూడదు. ఇవి ఇంట్లో ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇళ్లలో చిక్కుబడిన వైర్లు సైతం చెడు ఫలితాలను కలిగించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించుకుంటే మంచిదని చెప్పవచ్చు. చెత్త వస్తువుల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు.