దురదృష్టం మిమ్మల్ని వదిలిపెట్టలేదా…. ఈ పరిహారాలతో మీ సమస్యకు చెక్ పెట్టండి!

సాధారణంగా మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాల అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల సమస్యలు వెంటాడటమే కాకుండా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ఎలాంటి పనులు చేసిన పెద్దగా కలిసి రాకపోవడమే కాకుండా మానసిక ఇబ్బందులు కూడ తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిన్న పరిహారాలను చేయటం వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

ఆర్థిక సమస్యలతో పాటు ఏ పని చేసినా కలిసి రాకపోవడంతో మీకు దురదృష్టం వెంటాడుతున్నట్లే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొబ్బరికాయ తలపై భాగంలో పచ్చ కర్పూరం వెలిగించి దిష్టి తీయాలి. ఈ విధంగా 21 సార్లు దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయను పారుతున్న నీటిలో వేయాలి. అయితే కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరికి ఒక్కో కొబ్బరికాయతో ఇలా దిష్టి తీయాలి అయితే ఈ పరిహారం చేయడానికి మంగళ శని గురువారాలు ఎంతో ముఖ్యమైనది.ఇక ఎవరైతే శని దోష ప్రభావంతో బాధపడుతుంటారో అలాంటివారు అందులకు అన్నదానం చేయటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.

ఈ పరిహారంతో పాటు ఎవరైతే మానసికక్షోభతో బాధపడుతున్నారో అలాంటి వారి తలపై దుప్పటిని 21సార్లు మడిచి పేదలకు దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల కూడా దోషాలు తొలగిపోతాయి అయితే ఈ పరిహారం శనివారం చేయడం మంచిది. ఇక మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే పక్షులకు ఆహారం పెట్టడం ఎంతో ముఖ్యం. ఇలా పక్షులకు ఆహారం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.