ఆర్థిక సమస్యలను దూరం చేసే ఈ పూల మొక్కను ఇంట్లో పెంచండి..?

సాధారణంగా కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు. అయినప్పటికీ సంపాదించిన డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలా తరచూ ఆర్థిక సమస్యలతో బాధపడేవారు వివిధ రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాస్తు దోషం తొలగించడానికి మందార పువ్వు ప్రయోజనకరమైనదిగా వాస్తు శాస్త్రాన్ని పనులు సూచిస్తున్నారు. మందార పువ్వు మహాలక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరమైనది. మందార పువ్వు మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల సూర్యుడు బలపడతాడు. అంతే కాకుండా లక్ష్మీదేవికి ప్రీతికరమైన పుష్పం కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే, ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు వైపు మందార మొక్కను నాటడం వల్ల సూర్యుని స్థానం బలపడుతుంది. ఈ మొక్కను నాటడం ద్వారా, ఇంట్లో తండ్రితో అనుబంధం ఎల్లప్పుడూ బాగుంటుంది.

అలాగే మందార మొక్క మంగళ దోషాన్ని కూడా నాశనం చేస్తుంది. మీ జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే వివాహానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మందారం మొక్కను ఇంట్లో పెంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మిదేవికి ఇష్టమైన మందార పువ్వును సమర్పించి పూజించడం ద్వారా ఆ వ్యక్తి అన్ని రకాల ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం . పొందడం మాత్రమే కాకుండా ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్య భగవానుడికి మందార పువ్వులు సమర్పించి పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు.