శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా పరమశివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. ఈయనకు మనం వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ప్రీతి చెంది మన కోరికలను నెరవేరుస్తారని భావిస్తుంటారు అందుకే పెద్ద ఎత్తున భక్తులు శివుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలను నిర్వహిస్తూ ఉంటారు అయితే శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయటం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల అపమృత్యుదోషం తొలగిపోతుంది. ఆవు పాలతో స్వామి వారిని అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యములు ప్రసాదిస్తారు. పెరుగుతో అభిషేకం చేయటం వల్ల బలం ఆరోగ్యం యశస్సు కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల ధన ప్రాప్తి లభిస్తుంది. చక్కెరతో అభిషేకం దుఃఖ నాశనానికి కారణం. శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు బిల్వ దళ జలముతో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యములు లభించును.

తేనెతో అభిషేకం చేయటం వల్ల తేజ వృద్ధి కలుగుతుంది అలాగే పుష్పాలతో అభిషేకం చేయటం వల్ల భూ లాభం కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం సంపదలకు మూలకారకం. రుద్రాక్ష జలాభిషేకం చేయటం వల్ల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. ద్రాక్ష రసముతో అభిషేకం చేయటం వల్ల పనిలో విజయవంతం అవుతుంది ఖర్జూరాలతో అభిషేకం చేయటం వల్ల శత్రు హానిని హరింప చేస్తుంది. ఇలా వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎన్నో రకాల ఫలితాలను పొందవచ్చు.