దృష్టి దోషం తొలగించి ధనవంతులను చేసే కర్పూరం.. ఎలాగో తెలుసా..?

సాధారణంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని ఆశపడుతూ ఉంటారు. అందుకోసం చాలామంది ఎంతో కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇంత డబ్బు సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చవుతు అదనంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆ సమస్యల నుండి బయటపడటానికి కర్పూరంతో కొన్ని పరిహారాలు పాటించాలి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒక వ్యక్తిపై నరదృష్టి పడినప్పుడు ఆ వ్యక్తి ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి. నరదిష్టి ఎంత ప్రమాదం అంటే నరదృష్టి కి నాపరాయి కూడా పగులుతుంది అనే సామెత కూడా ఉంది. ఇలా నరదృష్టి వల్ల బాధపడుతున్న వారికి ఒక కర్పూరం బిల్ల తీసుకొని ఆ వ్యక్తి తల నుండి పాదాల వరకు సవ్య దిశలో మూడు సార్లు తిప్పి దిష్టి తీసి ఆ తర్వాత కర్పూరం నేలపై ఉంచి కాల్చాలి. ఈ విధంగా చేయడం వల్ల దిష్టి దోషం పోతుంది. అదేవిధంగా ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలంటే కర్పూరాన్ని నెయ్యిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాల్చాలి. ఇలా చేయటం వల్ల కర్పూరం సువాసనకి ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

అంతే కాకుండా రాత్రి సమయంలో ఓ వెండి గిన్నెలో లవంగాలు, కర్పూరాన్ని వేసి కాల్చాలి. ప్రతిరోజూ కర్పూరంతో ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తుంది. కర్పూరంతో ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజ చేసి అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి పూజ ముగిసిన తర్వాత కర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది.