ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా… ఈ మూడు విగ్రహాలు ఇంట్లో ఉంటే చాలు!

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోని అందుకు అనుకూలంగా కష్టపడుతూ పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ వచ్చిన డబ్బు వచ్చిన విధంగానే ఖర్చవుతుంది. ఇలా చేతిలో చిల్లి గవ్వ లేకుండా చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఇంట్లో ఈ మూడు రకాల విగ్రహాలను పెట్టుకోవడం ఎంతో మంచిది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు అలాంటి వారు ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం శుభసూచకం.ముఖ్యంగా ఏనుగు విగ్రహాలు తొండం పైకి ఎత్తి ఉన్నటువంటి విగ్రహాలను పెట్టుకోవడం మంచిది. ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా వారు వెండి లేదా ఇతడి విగ్రహాలను పెట్టుకోవచ్చు. ఇలా ఏనుగు విగ్రహాలు రాహు దోషాలను తొలగించి అపారమైన సంపదను అందిస్తాయి.

ఏనుగు విగ్రహంతో పాటు చేప విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవడం ఎంతో మంచిది. ఈ చేప విగ్రహాన్ని ఇంటిలో ఈశాన్య దిశలో పెట్టడం ఎంతో మంచిది. ఇది కూడా వెండిది లేదా ఇత్తడి విగ్రహాన్ని తయారు చేయించి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపమైనటువంటి తాబేలు ఇంట్లో పెట్టి పూజించడం వల్ల సంపదలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే తాబేలు విగ్రహాన్ని కూడా మన ఇంటిలో తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ విగ్రహాలతో ఆర్థిక సమస్యలకు వాస్తు పరంగా చెక్ పెట్టవచ్చు.