డబ్బు వృదా ఖర్చు అవుతుందా? ఆదాయం పెరగడం లేదా? అయితే ఇలా చేయండి..?

spending-money_a10css

ప్రస్తుత కాలంలో మనిషి జీవించటానికి డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఇంత కష్టపడే డబ్బు సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. దీంతో తరచూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి చాలామంది అనేక పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను మనం డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరగటానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తరచూ ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాల తో పరిహారం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అందుకోసం శుక్రవారం రోజున ఒక వెండి బాక్స్ తీసుకొని అందులో ఎనిమిది తామర పువ్వు గింజలను ఉంచాలి. అలాగే ఐదు ఏలకులు, ఐదు కర్పూరం బిళ్ళలు, కొంచెం కుంకుమపువ్వు వేయాలి. ఆ తర్వాత ఐదు రూపాయి బిళ్ళలు కూడా నీటితో శుభ్రం చేసి అందులో వేయాలి. ఆ తర్వాత ఆ వెండి బాక్స్ ని దేవుడి గదిలో ఉంచి కనకధారా స్తోత్రం చదివి ధూపం వేయాలి.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి ధూపం వెలిగించి ఆ తర్వాత వాటన్నింటినీ ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మూట కట్టాలి. ఆ మూటను ఆ వెండి బాక్స్ లో పెట్టి మూత పెట్టి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి తొలగిపోతాయి. అంతేకాకుండా కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి పూజించడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.