మేనల్లుడి తల నరికి ఇంట్లోనే శవాన్ని దహనం చేసిన మేనమామ..?

ప్రస్తుత కాలంలో హత్య నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్తుల కోసం, అమ్మాయిల కోసం దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రేమ హత్యలు, అక్రమ సంబంధాలు వల్ల జరిగే హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి హత్యలు అన్నీ కూడా చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఇటీవల ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడిని దారుణంగా హత్య చేసి శరీరం ముక్కలుగా చేసి గుండెను బయటికి తీసిన ఘటన హైదరాబాదులో సంచలనం రేపింది. ఆ ఘటన మరువకముందే ఇటీవల అనకాపల్లి జిల్లాలో ఇటువంటి సంఘటన చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే….అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలం గణపర్తిలో మేనమామ స్వయంగా మేనల్లుడిని చికెన్ కోసే కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. నర్సీపట్నానికి చెందిన శ్రీను అతని మేనల్లుడు లోవరాజు జీవనోపాధి కోసం ఇటీవల గుణపర్తికి వచ్చి అక్కడ చికెన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయో కానీ ఇటీవల శ్రీను అతని మేనల్లుడు అయిన లోవరాజును చికెన్ కోసే కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మేనల్లుడి శరీరం నుండి తలని, మొండెంను వేరు చేశాడు.

ఆ తర్వాత లోవరాజు తలను గోనె సంచిలో పెట్టి, మొండెంను గదిలో దహనం చేస్తుండగా గమనించిన స్థానికులు అతనిని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి పరిశీలించారు. వెంటనే ఈ దారుణానికి పాల్పడిన శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. శ్రీను తన మేనల్లుడిని ఇలా దారుణంగా హత్య చేయడానికి కారణం గురించి తెలుసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.