నడి రోడ్డులో డిగ్రీ అమ్మాయి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

వరంగల్ లో దారుణం జరిగింది. డిగ్రీ సెకండియర్ అమ్మాయి పై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న వరంగల్ లో  పెట్రోల్ దాడి కలకలం సృష్టించింది. 

రవళి అనే విద్యార్ధిని హన్మకొండలోని వాగ్ధేవి కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. అన్వేష్ అనే యువకుడు కూడా వాగ్దేవి కాలేజిలోనే చదువుతున్నాడు. గత కొంత కాలంగా అన్వేష్ ప్రేమించాలంటూ రవళి వెంట పడుతున్నాడు. దానికి రవళి నిరాకరించడంతో అన్వేష్ ఆమె పై కోపం పెంచుకున్నాడు. బుధవారం రవళి కాలేజికి వెళ్తుండగా అన్వేష్ ఆమె పై పెట్రోల్ తో దాడి చేసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.  

అన్వేష్

ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉంది. దీనిన గమనించిన తోటి విద్యార్దులు అన్వేష్ ను పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. రవళి స్వస్థలం సంగెం మండలం రామచంద్రాపురం.