బ్రేకింగ్ న్యూస్.. ఉప్పల్ లో విషాదం

వారిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు నెలల కిందటే వారికి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళుతుండగా కారు రూపంలో మృత్యువు అమ్మాయిని బలితీసుకుంది. వారిద్దరూ ఏకం కాకుండానే శాశ్వతంగా దూరమయ్యారు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉప్పల్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాలేంటంటే…

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినీషా, కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వినీషా గూగుల్ లో పనిచేస్తూ ఎస్సార్ నగర్ హాస్టల్ లో ఉంటుంది. వీరిద్దరికి రెండు నెలల క్రితమే ఎంగేజ్ మెంటు అయ్యింది.

ఇద్దరూ కలిసి శనివారం యాదాద్రికి బైక్ పై వెళుతుండగా ఢివైడర్ ను ఢికొట్టి కిందపడిపోయారు. వారి వెనుక నుంచి వస్తున్న కారు వినీషా పైనుంచి వెళ్లింది. దీంతో వినీషా అక్కడికక్కడే చనిపోయింది. కిరణ్ కు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ హఠాత్పరిణామంతో కిరణ్ షాక్ కు గురయ్యాడు. వినీషాను పట్టుకొని అతను కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఈ సంఘటనను చూసి స్థానికులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.