కిరాయి గుండాలతో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య.. ఆ వీడియోలు చూపించటం వల్లే..?

మన భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహం తర్వాత భార్యా భర్తలిద్దరూ ఒకరిని ఒకరి అర్థం చేసుకొని సంతోషంగా జీవించాలి. కానీ ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు విరిగిపోవడం వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తలు దూరం అవటమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడటం లేదా హత్యలు చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇచ్చలవిడిగా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న భర్తని ఒక భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖాజీపేటలో వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…పాలమూరు జిల్లా జన్నారపు వేణుకుమార్ అనే వ్యక్తి చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తుండగా, భార్య సుస్మిత రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాజీపేట రైల్వే కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే వేణు కుమార్, వేరొక మహిళను రెండవ వివాహం చేసుకున్నప్పటికీ సుస్మిత తన భర్తను వేధించకుండా సర్దుకుపోయింది. ఇదే అదునుగా చేసుకున్న వేణు కుమార్ మరి కొంతమంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలను తరచూ భార్యకు చూపిస్తూ వేధిస్తూ ఉండేవాడు.

రోజురోజుకీ భర్త ఆగడాలు మితిమీరి పోవటంతో సుస్మిత తరచూ తన భర్తతో గొడవపడేది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సుస్మిత ఎలాగైనా అతనిని హత్య చేయాలని భావించి నాలుగు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరి భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత ఏమి ఎరగనట్లుగా తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఒక వాగులో వేణు కుమార్ మృతదేహం లభించటంతో మంథని పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సుస్మిత పై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేయించినట్లు అంగీకరించింది. దీంతో సుస్మిత తో పాటు ఈ హత్యకు సహకరించిన మరొక ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.