ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య…. అనాధలుగా మారిన చిన్నారులు!

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్య భర్తల మధ్య సరైన అనుబంధం లేకపోతే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి హత్యలకు దారి చూస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ వీడి కోసం ఏకంగా కట్టుకున్న భర్తను అంతం చేసి కన్న పిల్లలను అనాధలుగా మార్చింది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే హతమార్చిన సంఘటన కర్ణాటకలోని మైసూర్ లో చోటు చేసుకుంది.

మైసూర్ కు చెందిన లిఖితకు, హోటగల్లికి చెందిన మంజుతో 12 సంవత్సరాలు క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కొంతకాలం క్రితం లిఖితకు ఒక వ్యక్తి పరిచయం అవడంతో అతని మోజులో పడి భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. దీంతో ఆమె తండ్రితండ్రులు నచ్చజెప్పి గ్రామ పెద్దల సమక్షంలో మంజు,లిఖితను ఒకటి చేశారు. ఆ తర్వాత కొంతకాలం లిఖిత సక్రమంగానే ఉంది. ఆ తర్వాత మళ్లీ తన ప్రియుడిని కలవడం కొనసాగించడంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి.

దీంతో తనకు అడ్డుగా వస్తున్నాడు అని ప్రియుడి సలహా మేరకు భర్త నీ హతమార్చాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి భర్త గొంతును గట్టిగా బిగించి చంపేసింది. అయితే తన నేరం బయటపడకుండా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన భర్త చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే లిఖిత గురించి తెలిసిన స్థానికులకు ఆమె మీద అనుమానం వచ్చింది. అంతే కాకుండా భార్యాభర్తల మధ్య గొడవల జరుగుతుండటంతో చుట్టుపక్కల వారు అనుమానం తో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తమదైన శైలిలో లిఖిత ని విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడితో కలిసి తానే తన భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.