తండ్రి హత్య కోసం కోటి రూపాయలు సుపారి ఇచ్చిన కొడుకు… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్థుత కాలంలో డబ్బు కోసం మనుషుల మధ్య సంబంధాలు కనిపించకుండా పోతున్నాయి. డబ్బు కోసం తల్లిదండ్రులు తోడబుట్టిన వారు అని కనికరం లేకుండా దారుణంగా దాడి చేయటమేకాకుండా హత్యలు కూడా చేస్తున్నారు. ఇటీవల బెంగుళూరు లో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం కన్న తండ్రి ని చంపటానికి కోటి రూపాయలు ఇచ్చిన కొడుకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.

వివరాలలోకి వెళితే… బెంగుళూరులో మారతహళ్లిలోని కావరప్ప బ్లాక్‌లో నివాసం ఉంటున్న నారాయణస్వామి అనే వృద్దుడు ఫిబ్రవరి 13న తన అపార్ట్‌మెంట్ బయట హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై కొడవలితో దాడిచేసి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. నారాయణ స్వామి కుమారుడు ఎన్‌ మణికంఠ ఈ హత్యను ప్రత్యక్షంగా చూసాడు. నారాయణ స్వామీ హత్య గురించి సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మణికంఠ ప్రత్యక్ష సాక్షి కావటంతో అతనితోపాటు హోస్కోటేకు చెందిన ఆదర్శ టి (26), శివ కుమార్ ఎన్‌ఎం (26)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మణికంఠ మీద గతంలో హత్యా నేరం కింద కేసులు నమోదు కావడంతో పోలీసులు అనుమానం వచ్చి అతనిని విచారించారు.

పోలీసుల విచారణలో తానే తన తండ్రిని హత్య చేయించినట్లు మణికంఠ అంగీకరించాడు. మణికంఠ అతని భార్య మద్య విభేదాలు రావడంతో కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. కొడుకు ప్రవర్తన నచ్చకపోవటంతో కోడలికి కూతురికి భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందని అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ను వారి పేరు మీద రాయాలని నారాయణ స్వామి భావించారు. అంతే కాకుండా నారాయణస్వామి మణికంఠకు డబ్బులు ఇవ్వటం కూడా పూర్తిగా ఆపేశాడు. దీంతో తండ్రి మీద కోపం పెంచుకున్న మణికంఠ తండ్రి తో పాటు అతని తల్లిని కూడా హతమార్చాలని ప్లాన్ చేశాడు. దీంతో శివ కుమార్‌, ఆదర్శలతో కలిసి హత్యకు పథకం వేసి తండ్రి ని హత్య చేయించాడు.