Crime News: యువకుడి దారుణ హత్య…. ఆస్తి తగాదాలే హత్యకు కారణమా?

Crime News:ఈ మధ్య కాలంలో దేశంలో క్రైమ్ రేట్ రోజురోజుకి పెరిగిపోతుంది ఉంది. పోలీసులు ఇటువంటి ఘటనలు జరగకుండా ఎంత కఠిన శిక్షలు అమలు చేసినప్పటికీ దేశంలో హత్యలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఆస్తి తగాదాలు, పరువు హత్యలు, పాత కక్షలు, వివాహేతర సంబంధాలు ఇలాంటి అనేక కారణాల వల్ల దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో ఇటువంటి హత్య చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రంలోని హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కుమారుడు ప్రదీప్‌ కు చంద్రిక అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రదీప్ భార్య చంద్రిక మూడవసారి గర్భవతి కావటంతో ప్రసవం కోసం తన పుట్టింటికి వెళ్ళింది. ప్రదీప్ దీప్ ఒక్కడే ఇంటిలో ఉంటూ పని చేసుకుని జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రదీప్ ని దారుణంగా హత్య చేసి తల, మొండెం వేరు చేసి తలని దగ్గరలో ఉన్న మరియమ్మ గుడి ఎదురుగా ఉంచారు. మొండాన్ని ఎక్కడో దూరంగా చెట్ల పొదలలో పడేశారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి హత్య వెనుక కారణాల గురించి స్థానికులను ఆరా తీశారు. గుడి ఎదురుగా చాలా లభ్యమవటం తో సమీపంలోని ప్రాంతాలలో శరీరం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ తరుణంలో సంఘటన స్థలానికి కొంచెం దూరంలో చెట్లపొదల మధ్యగా తల లేని మొండెం పోలీసులు గుర్తించారు. హత్య గురించి స్థానికులను పోలీసులు విచారణ చేయగా ప్రదీప్ బంధువులు అయిన సంతోష్, మురళితో 15 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయని , ఆస్తి గొడవల కారణంగా వారే ఈ హత్యకు పల్పడివుండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.