కన్న కొడుకుని కడతేర్చిన తండ్రీ … కారణం తెలిస్తే షాక్…?

నవ మసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన పిల్లలను కొట్టడానికి కూడా తల్లితండ్రులకు మనసు ఒప్పదు. కానీ ఒక తండ్రి మాత్రం తన కన్న కొడుకుని చేతులారా చంపాడు. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఆ తండ్రి అలా చేయటానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఉన్మాదిలా మారి కుటుంబసభ్యులను వేదిస్తున్న కొడుకుని కన్న తండ్రే స్వయంగా హత్య చేశాడు. వివరాలలోకి వెళితే…శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిళ్లాం గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యనారాయణ, పోలమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా, కుమారుడు రాము(33) కూడా ఆర్మీలో పని చేసేవాడు. కానీ రాము ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు.

అతని ప్రవర్తన భరించలేక కట్టుకున్న భార్య కూడా విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. ఇలా ఉన్న ఉద్యోగం ఊడిపోవడం, కట్టుకున్న భార్య దూరం కావడం వల్ల రాము ప్రవర్తన మరింత దారుణంగా మారింది. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులను కూడా ఇబ్బంది పెట్టేవాడు. రాము ప్రవర్తనతో గ్రామస్థులు కూడా విసుగు చెందారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాము మద్యం మత్తులో తల్లి పోలమ్మతో గొడవ పడటం ప్రారంభించాడు. దీంతో తండ్రి సూర్యనారాయణతో పాటు గ్రామస్థులు కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అయినా రాము వినకుండా మరింత రెచ్చిపోయి తన తల్లిని విచక్షణారహితంగా కొట్టి హింసించడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. తన భార్య ఇలా తీవ్ర గాయాలపాలవటంతో అది చూసి తట్టుకోలేకపోయిన సూర్య నారాయణ ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డుతో రాము తలపై గట్టిగా కొట్టాడు. దీంతో రాము అక్కడికక్కడే సృపకోల్పోయి మరణించాడు. ఆ తర్వాత సూర్యనారాయణ స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ క్రమంలో పోలిసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.