ఆరునెలల గర్భవతిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన దుర్మార్గుడు… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశంలో హత్యా నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా మనుషులను కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు పెరిగిపోవటం వల్ల హత్యా నేరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కాకినాడ జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల గర్భవతి మీద కనికరం చూపకుండా దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే..కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని అప్పన్నపాలెంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్న దూసర నాగరత్నం అనే మహిళకు వివహామయ్యి, ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. అయితే నాగరత్నం అనే మహిళకు అదే గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇటీవల బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల నాగరత్నం భర్త కుటుంబ సభ్యులు కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో నాగరత్నం మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంది.

ఇదే అతనితో భావించిన పిల్లి రాజు నాగరత్నం ఇంట్లోకి చేరబడి ఒంటరిగా ఉన్న ఆమె మీద కత్తితో దాటికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నాగరత్నం తీవ్ర గాయాల పాలెం అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులు అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలంలో పరిశీలించి ఘటనకు సంబంధించిన కారణాల గురించి స్థానికులను విచారించారు. ఈ క్రమంలో నాగరత్నం, పిల్లి రాజు మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి స్థానికులు పోలీసులకు వెల్లడించారు. పిల్లి రాజుకు కూడా వివాహం అయ్యే ఒక కుమారుడు ఉన్నాడని పోలీసులు విచారణలో వెల్లడయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రారంభించారు. పరారీలో ఉన్న పిల్లి రాజు కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు మొదలు పెట్టారు.