మైనర్ బాలికపై సవతి తండ్రి హత్యాచారం.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..?

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు కొంతమంది మగవాళ్ళు మృగాలుగా మారిపోయి వారి కోరికలు తీర్చుకోవడానికి దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా మరి కొంతమంది తల్లి, బిడ్డ, అక్క, చెల్లి అని భేదం లేకుండా తమ కామ వాంఛలు తీర్చుకోవడానికి కుటుంబంలో ఉన్న స్త్రీల మీదే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మరవకముందే ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి లేకపోతే సొంత తండ్రిలా చూసుకోవాల్సిన సవతి తండ్రి మైనర్ బాలికపై హత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…ఉత్తర్ ఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్ ప్రాంతం లో దంపతులు తమ కూతురితో కలసి నివసిస్తున్నారు. అయితే ఆ మహిళ భర్త మరణించడంతో వేరొక వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. రెండవ వివాహం చేసుకున్న తర్వాత తన కూతురితోపాటు రెండవ భర్తతో కలిసి జీవించేది. ఇలా కొంతకాలం వీరి జీవనం సంతోషంగా సాగింది. అయితే ఇంట్లో ఉన్న మైనర్ కూతురి మీద ఆ సవతి తండ్రి కన్ను పడింది. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని భావించి బాలికను బెదిరించి బాలికపై అత్యాచారం చేసేవాడు. తండ్రి మరణించిన తర్వాత కన్నతండ్రిలా చూసుకోవలసిన వ్యక్తి ఇలా తనపై అత్యాచారం చేయటంతో ఆ బాలిక తట్టుకోలేకపోయింది.

ఈ క్రమంలో ఆ బాలిక సఖి వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించి తన బాధ చెప్పుకొని తనని రక్షించమని వేడుకుంది. దీంతో సఖి సెంటర్ నిర్వాహకురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. సవతి తండ్రి వేధింపులు నిజమే అని అంతే కాకుండా పోలీసులు అతన్ని తమదైన శైలిలో విచారించగా.. ఆ బాలిక తల్లి సహాయంతోనే లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో పోలిసులు షాక్ అయ్యారు. కన్న కూతురు అన్న కనికరం లేకుండా ఇలా లైగింక దాడికి ప్రోత్సహించిన ఆ బాలిక తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన మరి కొన్ని విషయాల గురించి తెలుసుకోవటానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.