Suicide: ప్రియుడు దక్కడనే బాధతో ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక..!

Suicide: ఈ ఆధునిక కాలంలో ప్రేమించడం అనేది అందరికీ ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా, పెళ్లి అయిన వారు, కాని వారు అనే బేధం లేకుండా ప్రేమించడం అధికం అయ్యాయి. ఈ క్రమంలో ప్రేమలో విఫలమై మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి ఘటనే తిరుమలగిరి మండలం లో చోటుచేసుకుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న బాలిక…. ఇంకా పెళ్లి వయసు రాలేదు అని పెద్దలు మందలించడంతో ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు….. తిరుమలగిరి మండలం నాగార్జున పేట తండాలో నివాసముండే ఆంగోతు పాప, కమిలి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె ఎందుకు 14 సంవత్సరాలు . ఇందు దేవరకొండ లోని కస్తూరిబాయి గాంధీ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో దిన కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దేవరకొండ లో నివాసముండే బానావత్ శ్రీను దంపతుల పెద్ద కుమారుడు 20 ఏళ్ల బానోత్ వినోద్కరుణ కారణంగా కాలేజీలో మూతపడటంతో గ్రామంలోని తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లేవాడు.

ఇందు నీ తన తల్లిదండ్రులు తమతో పాటు కూలీ పనులకు తీసుకు వెళ్ళేవారు. కూలి పనులు చేసే ప్రదేశంలో ఇందు శ్రీను మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత వీరి ప్రేమ విషయం వినోద్ ఇంట్లో తెలియడంతో వినోద్ తల్లిదండ్రులు ఇందు ఇంటికి వెళ్లి పెళ్లి విషయం ప్రస్తావించారు. తమ కూతురికి ఇంకా పెళ్లి వయసు రాలేదని, ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశ్యం లేదని చెప్పారు. తను ప్రేమించిన వాడిని ఎలా అయిన పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న ఇందు, అతను దక్కడేమో అనే మనస్తాపం తో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. అనంతరం ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు, అయితే చికిత్స పొందుతూ ఇందు మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.