హైదరాబాదు మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై మండిపడ్డ బండి సంజయ్..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగటంతో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ ఘటనపై మండిపడ్డారు. అందులో అధికారిక పార్టీ మిత్ర పక్షానికి చెందిన నేత బంధువు కూడా ఉన్నట్లు తెలియటంతో.. కేసీఆర్ వారిపై చర్యలు తీసుకునేందుకు ఓవైసీ కోసం ఎదురుచూస్తున్నారా అని ప్రశ్నించారు.

ఈ ఘటనతో జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలలో కూడా మహిళలకు భద్రత లేదని అన్నారు. ఇక ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి అంటూ.. నిందితులను సరిగ్గా గుర్తించలేని విధంగా ఉన్న సీసీ కెమెరాలు ఎందుకని ప్రశ్నించారు. ఘటన జరిగిన కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు అంటూ.. వారు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని.. పోలీసులు దాగుడుమూతలు ఆడడం మానేసి నిందితుల వివరాలను బహిర్గతం చేయాలని అన్నారు