బ్రేకింగ్ న్యూస్‌… వరంగల్ జిల్లాలో స్కూల్ బస్సును ఢికొట్టిన లారీ

వరంగల్ రూరల్ జిల్లా వర్దన్న పేటలో ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్దులకు గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీ అరబిందో స్కూల్ కు చెందిన బస్సు విద్యార్దులను తీసుకొని పాఠశాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదానికి కారణమైన లారీ
ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు

ప్రమాదం జరగడంతో చిన్నారులంతా భయాందోళనకు గురయ్యారు. వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఇరుక్కుపోయిన చిన్నారులను బయటికి తీశారు. చిన్నారులందరిని హూటాహూటిన ఆసుపత్రికి తరలించారు. చాలా మంది విద్యార్దులకు కాళ్లు, చేతులు, తలలకు దెబ్బలు తాకాయి. ముగ్గురి విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే చిన్నారుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ రోజు విద్యాసంస్థల బంద్ ఉన్నప్పటికి కూడా పాఠశాలను పెట్టి పిల్లల ప్రాణాల మీదకు తెచ్చారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి

అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే…