కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ శివారులోని కీసర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలతో సహా వారి 11 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన చూసిన వారంతా కన్నీరు మున్నీరయ్యారు. అసలు వివరాలు ఏంటంటే…

దినేష్ కుమార్ ఉప్పల్ లోని అపోలో ఫార్మసీలో సెంట్రల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య సాగరికి, కుమారుడు రుషికేష్ తో కలిసి ఘట్ కేసర్ నుంచి కీసర వైపు కారులో వస్తున్నాడు. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డులోని రెయిలింగ్ ను ఢి కొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. కారులో ఉన్న భార్య భర్తలతో సహా చిన్నారి మృతి చెందాడు.

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలియగానే అపోలో ఫార్మసీ సహ ఉద్యోగులు అక్కడకు చేరుకున్నారు. అతనిది పక్క రాష్ట్రం కావడంతో ఇక్కడ  బంధువులెవరూ లేక పోవడంతో వారి బంధువులకు సమాచారమందించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.