నల్లగొండలో ఆర్టీసి బస్సు- టాటా ఏస్ ఢీ, ఏడుగురి స్పాట్ డెడ్

నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

టాటా ఏస్ వాహనాన్ని దేవరకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు ఢికొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటోలో లో ఉన్న వారు చనిపోయినట్టు తెలుస్తోంది. బస్సులో ఉన్న వారికి గాయాలైనట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని క్షతగాత్రులను నల్లగొండ, ,దేవరకొండ ఆస్పత్రులకు తరలించారు. డెడ్ బాడీలను నల్లగొండ తరలించారు. ఈ ఘటనతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.