దారుణం.. మహిళకు మత్తుమందు ఇచ్చి ఆపై లైంగిక దాడి…!

ప్రస్తుత కాలంలో దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. చిన్నపిల్లలు, ముసలి వారు, యువత అని తేడా లేకుండా కొందరు మగాళ్లు మృగాలుగా మారి వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వారిలో ఉన్న లైంగిక కోరికలను నెరవేర్చకపోతే మహిళల మీద దాడికి పాల్పడుతూ హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. మరికొంతమంది దుర్మార్గులు మహిళలకు సంబంధించిన నగ్న ఫోటోలు, వీడియోలు చూపించి వారిని బెదిరించి లొంగదీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి దారుణమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తన కోరికలు తీర్చనందుకు ఒక దుర్మార్గుడు మహిళకు మత్తుమందు ఇచ్చి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా డిండి మండలం జేత్యతండాకు చెందిన ఓ మహిళ (28) చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో ఇద్దరి పిల్లలతో కలిసి బ్రతుకుతెరువు కోసం శంషాబాద్ లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పిల్లలతో కలిసి జీవిస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లికి చెందిన ముడావత్‌ చందూలాల్ అనే వ్యక్తి శంషాబాద్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. చందూలాల్ కి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వితంతు మహిళ మీద కన్ను పడింది. అందువల్ల ఆమెతో పరిచయం పెంచుకొని స్నేహం పేరుతో ఆమెని లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ముడావత్ చందులాల్ వేధింపులకు భరించలేక ఆ మహిళ తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని బంధువుల ఊరైన నల్లగొండ జిల్లా డిండి మండలం వీరబోయనపల్లి తండాకు వెళ్లి జీవనం సాగిస్తోంది.

అయినప్పటికీ చందూలాల్ ఆమెని వదలకుండా అతని కోరికలు తీర్చుకోవడం కోసం ఆ మహిళ నివసిస్తున్న ప్రాంతానికి చేరుకున్నాడు. తర్వాత జూన్ 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగానే తన వెంట తెచ్చుకున్న మత్తుమందు వేసిన ఖర్చుతో ఆమెను స్పృహ కోల్పోయేలా చేసి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో నగ్నంగా ఉన్న ఆ మహిళ ఫోటోలు తీసి తర్వాత ఆ మహిళకి ఆ ఫోటోలను పంపి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు అందరికీ పంపిస్తానని ఆమెని బెదిరించేవాడు. అయితే ఆ మహిళ అతని బెదిరింపులు భరించలేక ఈనెల 23వ తేదీ శంషాబాద్ పోలీసులను ఆశ్రయించి చందులాల్ మీద ఫిర్యాదు చేసింది. దీంతో శంషాబాద్ పోలీసులు ఈ కేసుని డిండి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయగా ఈ సోమవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసే అదుపులోకి తీసుకున్నారు.