పిల్లల్ని నగ్నంగా నిలబెట్టి శిక్షించిన పుంగనూర్ స్కూల్ (వీడియో)

చిత్తూరు జిల్లా  పుంగనూరు చైతన్యభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అమానుషం జరిగింది.

స్కూల్ కి ఆలస్యంగా వచ్చారని, హోం వర్క్ చేయలేదని  అయిదుమంది విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టి శిక్షిచారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీనితో అధికారులు వెంటనే స్కూల్ గుర్తింపును రద్దు చేశారు.  

విద్యార్థులను ఇలా నగ్నంగా నిలబెట్టడంతో విద్యార్థులు సిగ్గుతో బిక్క చచ్చిపోయారు. తోటి విద్యార్థుల క్లాస్ రూం లనుంచే కాకుండా పాఠ శాల ప్రహరీ పక్క నున్న రోడ్డ న పోయే అనేక మంది ప్రజలు కూడా ఈ  దారుణాన్ని చూశారని, దీనితో పిల్లలు బాగా అవమానం జరిగిందని కుంగిపోతున్నారని తల్లితండ్రులు తెలిపారు.

 మండల విద్యాధికారి లీలా రాణి ఈ సంఘటన మీద దర్యాప్తుచేసి సంఘటననుదృవీకరించారు. బుధవారం సాయంకాలం ఈ సంఘటన గురించి తెలిసిందని, వెంటనే పాఠశా ల యాజమాన్యం మీద చర్య తీసుకోవడం జరిగిందని ఆమె చెప్పారు.

తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల చైతన్య భారతి పాఠశాల కరెస్పాండెంట్ ను అరెస్టు చేశారు.