రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్పై దుర్మరణం చెందారు. భూధాన్ పోచంపల్లి ఎస్సైగా పని చేస్తున్న మధు విధుల నిమిత్తం నల్లగొండకు వెళుతున్నాడు. మంగళవారం ఉదయం నార్కట్ పల్లి శివారులోని ఎంజీ యూనివర్సిటి దగ్గర ఎస్సై ప్రయాణిస్తున్న బొలొరే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఎస్సై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ఎస్సై మృతి చెందడంతో పోచంపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.