మటన్ ముక్క కోసం పెళ్లిలో లొల్లి లొల్లి, 8 మందికి గాయాలు (వీడియో)

మటన్ ముక్క పెళ్లి విందులో ఉద్రిక్తతకు దారి తీసింది. మటన్ తో భోజనం పెట్టలేదని పిల్లగాని తరుపు బంధువులు పిల్ల తరపు బంధువులతో లొల్లికి దిగారు. దీంతో అక్కడ చినికి చినికి గాలి వానలా మారి పెద్ద పెద్ద రచ్చ రచ్చ అయ్యింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాకకు చెందిన ఆజ్మీరా కుమారి వివాహం కొత్తగూడెనికి చెందిన లావుడ్యా ప్రవీణ్ నాయకుతో శుక్రవారం ఉదయం పిల్ల ఇంటికాడ పెండ్లి జరిపించారు. పెళ్లి తర్వాత అంతా భోజనం చేసేందుకు వెళ్లగా అక్కడ వారు చికెన్ తో బువ్వ పెడుతున్నారు. దీంతో ఆగ్రహించిన పిల్లగానోళ్లు మటన్ తో బువ్వ పెట్టాలని లొల్లి చేశారు. దాంతో పిల్లతరపు వాళ్లు మాకు అంత స్థోమత లేదని చికెన్ తో భోజనం చేయాలని నచ్చ చెప్పారు.

ఇంతలోనే ఇరు వర్గాల మధ్య లొల్లి చినికి చినికి గాలివానలా మారి కొట్లాటకు దారి తీసింది. ఈ లొల్లిలో 8 మందికి తీవ్రగాయాలు కాగా 100 కుర్చీలు విరిగిపోయాయి. ఇరు వర్గాల వారు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వీడియో అక్కడున్న వారు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.