హైదరాబాద్‌లో పట్టపగలే నడి రోడ్డు పై నరికేశారు (ఎక్స్ క్లూజివ్ వీడియో)

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో పట్టపగలే దారుణం జరిగింది. నడిరోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి పై మరో ఇద్దరు వ్యక్తులు కలిసి గొడ్డలితో ఇష్టమొచ్చినట్టు నరికి… చచ్చాడు అని నిర్ధారించుకున్నాకే నరకడం ఆపారు. ఈ దారుణ సంఘటన అత్తాపూర్ పిల్లర్ నంబర్ 138 వద్ద చోటు చేసుకుంది. గొడ్డలితో దాడి చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

 

స్థానికులు అడ్డుకునేందుకు యత్నించినా హంతకులు ఆగలేదు. పోలీసులను చూసి కూడా హంతకులు భయపడలేదు. అక్కడున్న వారంతా చూస్తూ ఉన్నారు తప్పా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. హంతకుడు మృతుని పై 10 నుంచి 15 సార్లు దాడి చేశాడు. హత్య తరువాత నలుగురు నిందితులు పోలీసుల వద్ద లొంగి పోయారు.

హత్యకు గురైన వ్యక్తిని రమేష్ గా పోలీసులు గుర్తించారు. అయితే రమేష్ గతంలో బేగంబజార్ కు చెందిన మహేష్ అనే వ్యక్తిని ఆరు నెలల క్రితం శంషాబాద్ లో మర్డర్ చేశాడు. ఈ కేసులో రమేష్ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పిల్లర్ నంబర్ 138 వద్ద మాటు వేసిన మహేష్ బంధువులు అతని పై గొడ్డలితో దాడి చేసి మట్టు బెట్టారు.