తెలంగాణలో బిజెపి అభ్యర్దికి ఊహించని షాక్

మీ అభ్యర్దిత్వం తమకు ఇష్టం లేదంటూ బిజెపి నేతలు ఆ అభ్యర్దికే వినతిపత్రం ఇచ్చారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బద్దం బాల్ రెడ్డి బిజెపి తరపున పోటి చేస్తున్నారు. ఆయన అభ్యర్దిత్వం ఇష్టం లేని కొంత మంది నాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్ రావు లకు వినతి పత్రాలిచ్చారు.  అయితే కోర్ కమిటిలోని సభ్యులకు కూడా వినతిపత్రాలు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. 

బద్దం బాల్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న నేతలు

కోర్ కమిటిలో సభ్యులుగా ఉన్నా బద్దం బాల్ రెడ్డికి కూడా వినతిపత్రం ఇచ్చారు. రాజేంద్రనగర్ నుంచి పోటి చేస్తున్నది కూడా బద్దం బాల్ రెడ్డే. దీంతో ముందుగా కాస్త ఖంగుతిన్నా తాను పార్టీ ఆదేశాల మేరకు పోటి చేస్తున్నానని నేతలతో బాల్ రెడ్డి తెలిపారు. పార్టీ తప్పుకోమంటే తప్పుకుంటానని లేకపోతే తాను పోటి చేస్తానని బాల్ రెడ్డి తెగేసి చెప్పారు.