యాదాద్రి జిల్లా నందనంలో దారుణం (ఎక్స్ క్లూజివ్ వీడియోలు)

యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామంలో దారుణం జరిగింది. ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పి స్నేహితుడిని తీసుకుపోయిన వ్యక్తి పైసల కోసం స్నేహితుడి మీదనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  ఆ తర్వాత స్నేహితుని వద్దనున్న 3 లక్షల రూపాయలతో పరారయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటంటే…

యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానికుల దగ్గరి నుంచి భూములు తీసుకొని వెంచర్లు గా చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. మెగాసిటి  పేరుతో వెంచర్ ను ఏర్పాటు చేశారు. గౌతమ్, విక్రమ్ ఇద్దరు స్నేహితులు. మెగాసిటిలో తక్కువ ధరకే ఫ్లాట్లు ఉన్నాయని, చాలా మంచి వాతావరణంలో ఉంటుందని విక్రమ్ గౌతమ్ ను నమ్మించాడు. దీనిని నిజమనే నమ్మిన గౌతమ్ 3 లక్షల రూపాయలు తీసుకొని విక్రమ్ తో కలిసి ఆదివారం ఉదయం నందనం చేరుకున్నాడు. 

గౌతమ్ కు ప్లాటు గురించి చెబుతున్నట్టు నటించిన విక్రమ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను గౌతమ్ పై పోశాడు. గౌతమ్ తేరుకునే లోపే విక్రమ్ అగ్గిపుల్ల గౌతమ్ పై వేశాడు. దీంతో శరీరమంతా మంటలు అంటుకున్నాయి. గౌతమ్ దగ్గర 3 లక్షలు తీసుకొని విక్రమ్ పరారయ్యాడు. అక్కడే పక్కకు బావుల దగ్గర ఉన్నవారు గౌతమ్ అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భువనగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ చనిపోయాడు.   వీడియోలు కింద ఉన్నాయి చూడండి. 

nandanam

 

nandanam2

 

ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా మర్డర్ జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విక్రమ్ కావాలనే చేశాడానే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరికి ఏమైనా పాత కక్ష్యలు ఉన్నాయా లేక పైసల కోసం చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. గౌతమ్  హైదరాబాద్ కాచిగూడకి చెందినవాడు.  విక్రమ్ చేత ఎవరైనా చంపించారా , స్నేహితుడిని చంపాల్సిన అవసరమేముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రమ్ దొరికితే కానీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. గౌతమ్ కు భార్య, చిన్న కూతురు ఉన్నట్ట తెలుస్తోంది.