భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దంపతుల దారుణ హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దారుణం జరిగింది. వృద్ద దంపతులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు.

మృతులను చుక్కయ్య, ఎల్లమ్మగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇస్త్రీ పని చేసుకుని బతికే ముసలి వాళ్లను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరమేముందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

హత్యకు గురైన దంపతులు

దంపతుల హత్య పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవని, అయినా వీరిని హత్య చేయాల్సిన అవసరమేముందని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షల లేక కొద్ది పాటి వివాదాలతోనే ఇలా చేశారా అని అంతా అనుమానిస్తున్నారు. వృద్ద దంపతుల హత్య స్థానికంగా కలకలం రేపింది.