కొడుకు ఫ్రెండ్ తో తల్లి వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి కొడుకును

ఆ తల్లి పేగు బంధాన్ని కూడా మరిచింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చేతికి ఎదిగిన కొడుకునే హత్య చేసింది. వివాహేతర సంబంధానికి ప్రాధాన్యం ఇచ్చి అమ్మ అనే పదానికే అపకారం తెచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హరియాణాలోని జజ్జర్ జిల్లా చమన్ పురాకు చెందిన మీనా దేవి అనే మహిళకు 44 ఏండ్లు. ఈమెకు ప్రమోద్ అనే 23 ఏండ్ల కొడుకున్నాడు. ప్రమోద్ బౌన్సర్ గా పని చేసేవాడు. అతని స్నేహితుడు ప్రదీప్ అప్పుడప్పుడు వారింటికి వచ్చేవాడు. అలా మీనాదేవికి ప్రదీప్ కి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్రమోద్ కు తెలిసి ఉద్యోగం మానేశాడు. తల్లిని ఏం అనలేక స్నేహితున్ని మందలించాడు. ఇంటి వద్దే ప్రదీఫ్ ఉంటున్నాడు.

దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మీనా తన ప్రియుడు ప్రదీప్ తో కలిసి కొడుకును హత్య చేయాలని భావించింది. మరో ఇద్దరి సహాయంతో ప్రమోద్ ను ప్లాన్ ప్రకారం హత్య చేశారు.   ఆ తర్వాత మీనా దేవి తన కొడుకును ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.