పెళ్లయి సంవత్సరంన్నరే… ఇంతలోనే ఆ మహిళకు ఏమైందంటే

కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మాలూరు మండలం రాంపుర గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, సవిత దంపతులు. వీరికి సంవత్సరంన్నర క్రితం వివాహం జరిగింది. భార్య భర్తలు అన్యోన్యంగానే ఉండేవారు. వీరికి సంవత్సరం  వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. సవితకు సంవత్సరం నుంచి కడుపు నొప్పి వస్తుంది. తరచు కడుపు నొప్పి వస్తుండడంతో వివిధ ఆస్పత్రులలో చికిత్ప పొందింది.

ఇటివల కాలంలో భరించలేనంత నొప్పి వస్తండడంతో ఆమె మానసిక క్షోభకు గురైంది. జీవితం పై విరక్తి చెందిన సవిత బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. దీనిని గమనించిన ఇరుగు పొరుగు భర్తకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగుళూరు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సవిత గురువారం చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.