భార్య, అత్తను కొట్టిన పోలీసుపై వేటు (వీడియోలు)

భార్య అత్తను విచక్షణా రహితంగా కొట్టిన మణుగూరు ఎస్పై జితేందర్ ను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎస్పైగా పనిచేస్తున్న జితేందర్ తన భార్య ఫర్వీన్ ను, అత్తను విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో ఫర్వీన్ కు రక్తం కారి గాయాలపాలైంది. ఎస్పై వారిపై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసుకొని జితేందర్ మణుగూరు నుంచి బదిలీ చేసి ఎస్పీ ఆఫీసులు అటాచ్ చేశారు. ఎస్సై దాడికి పాల్పడ్డ  వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

 

జితేందర్ ఫర్వీన్ ను 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జితేందర్ కు మరో మహిళతో సంబంధం ఉందని ఫర్వీన్ ఆరోపిస్తుంది. వీరికి ఒక  కుమారుడు కూడా ఉన్నారు. గొడవలతో ఫర్వీన్ కొంత కాలంగా తన అమ్మగారింటి దగ్గరే ఉంటుంది. మహిళా సంఘాలను తీసుకొని అడగటానికి రావడంతో ఎస్సై వారిపై దాడికి పాల్పడ్డాడు.