ప్రేమికుడితో కలిసి బౌద్ద గుట్టల్లోకి వెళ్లిన ప్రేమికురాలు… చివరికి

పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న ప్రేమికుల పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో యువతి మృతి చెందగా యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. రాజధాని శివారులో జ్యోతి మర్డర్ మరువక ముందే జీలకర్రగూడెంలో జరిగిన ఘటన అందరిని కలవరపరిచింది.

ధరణి, నవీన్ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ధరణిది ఉంగుటూరు మండలం ఎంఎం పురం.  నవీన్ ది ఆర్జావారిగూడెం. ధరణి బిఎస్సీ ఫస్టియర్ చదువుతుండగా, నవీన్ బికాం ఫస్టియర్ చదివి ఆపేశాడు. వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు ఆదివారం ఉదయం గుంటుపల్లిలోని బౌద్దరామాలయాన్ని చూడడానికి వచ్చారు. అక్కడ చెట్ల దగ్గర ఈ జంట ఏకాంతంగా గడిపినట్టు తెలుస్తోంది. 

గాయపడ్డ నవీన్

అయితే మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో యువతి, యువకుడు తీవ్రగాయాలతో రక్తంలో పడి ఉండడాన్ని సెక్యూరిటి గార్డు చూశాడు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. వారు వచ్చి చూడగా అప్పటికే యువతి చనిపోగా యువకుడు ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. యువతి శరీరం పై బట్టలు లేవు. ఆమె తీవ్ర రక్తస్రావంలో ఉంది. దీంతో ఆ అమ్మాయి పై అత్యాచారం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఘటన స్థలానికి దగ్గర్లోని బండ పై ధరణి శ్రీ, నవీన్ పేర్లు

నవీన్ ను వివరాలు అడుగగా కేవలం తన పేరు మాత్రమే చెప్పి మిగిలిన వివరాలు చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఇది ఎవరైనా తెలిసిన వారే చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. వీరిద్దరి మధ్యే గొడవ జరిగి ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారా లేక ఎవరైనా దుండగులు వీరి పై దాడికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

యువతి పై అత్యాచారం జరిగిందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే రాజధాని శివారులో జ్యోతి పై జరిగిన హత్యకు దీనికి చాలా దగ్గరి సంబంధాలు ఉండడంతో పోలీసులు ఇది ప్రేమికుని పనేనని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. యువతి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.