వామ్మో నటి కీర్తి సురేష్ ఫోటోతో 41 లక్షలు లూటీ చేసిన కిలాడి లేడీ?

ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఈజీగా హానీ ట్రాప్ లో కూరుకుపోయి పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోతున్నారు. అయితే బాగా చదువుకున్న వాళ్ళు సైతం ఇలా లక్షల్లో డబ్బు నష్టపోవడం తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈమె ఏకంగా నటి కీర్తి సురేష్ ఫోటోని పెట్టి కాలేజీ స్టూడెంట్ అంటూ ఒక అబ్బాయిని వలలోకి దింపి ఏకంగా 41 లక్షల రూపాయలు లూటీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

కర్ణాటకలోని హాసన్‌ జిల్లాకు చెందిన మంజుల అనే మహిళ ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్‌ అకౌంట్‌ తెరిచింది. ఇలా ఫేస్బుక్ అకౌంట్ కు కొద్దిగా కీర్తి సురేష్ ఫోటోని ఎడిట్ చేసి డిపిగా పెట్టుకుంది. ఇక ఈమె విజయపుర జిల్లాకు చెందిన పరమేశ్వరన్‌ అనే వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. పరమేశ్వరన్‌ ఓ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కాలేజ్ స్టూడెంట్ అని పరిచయం చేసుకొని అతనితో చాటింగ్ మొదలుపెట్టింది.ఇలా వీరిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఉండగా ఒకరోజు మంజుల తనకు ప్రపోజ్ చేయడంతో అతను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఈ క్రమంలోనే తరచు తనతో మాట్లాడటమే కాకుండా గిఫ్టులు ఇప్పించుకోవడం కాలేజీకి పీజు కట్టడానికి డబ్బులు ఇప్పించుకోవడం వంటివి చేశారు.

ఇలా ప్రేమలో ఉన్నట్టు నటించిన మంజుల ఒకరోజు పరమేశ్వరన్ బాత్రూంలో ఉన్నటువంటి వీడియోని సంపాదించింది.ఇలా వీడియో తన చేతికి చిక్కడంతో తన అసలు రూపం బయటపెట్టి ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలంటే తనకు డబ్బు కావాలని తనని బెదిరించింది ఇలా పరమేశ్వరన్ ఏకంగా 41 లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ తన పంతా మానుకోకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.