రోడ్డు ప్రమాదంలో ఇంటర్ అమ్మాయి మృతి

కూకట్ పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది.కూకట్ పల్లిలోని  శ్రీ చైతన్య కళాశాలలో రేగుల రమ్య ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లే క్రమంలో రమ్య రోడ్డును దాటుతుంది. ఈ సమయంలో అటు నుంచి వచ్చిన శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన బస్సు రమ్యను ఢికొట్టింది. దీంతో రమ్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. రమ్య చైతన్య కాలేజిలో చదువుతుండగా.. చైతన్య కళాశాలకు సంబంంధించిన వేరే క్యాంపస్ బస్సే రమ్యను ఢికొట్టింది.  

https://www.youtube.com/watch?v=0SbG3PZjO7s

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రమ్య

ప్రమాదం జరగడంతో ఆగ్రహం చెందిన తోటి విద్యార్దులు చైతన్య కాలేజ్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. టైర్లలో గాలి తీశారు. బస్సును తగులబెట్టెందుకు ప్రయత్నించగా ఈ లోపు పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

 బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్దులు రోడ్డు పై ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విద్యార్ధిని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతసేపు మాట్లాడిన దోస్తు కళ్లముందే చనిపోవడంతో తోటి విద్యార్ధినులు కన్నీరు మున్నీరయ్యారు.

ప్రమాద విషయం తెలుసుకున్న రమ్య తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని గుండెలవిసేలా విలపించారు. కూతురును అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే ఇలా అర్దాంతరంగా తీసుకుపోయావా.. దేవుడా అంటూ వారు రోదించారు.