హైదరాబాద్ యువకుడికి పరువు హత్య భయం

మిర్యాలగూడ ప్రణయ్ ఉదంతం మరువక ముందే హైదరాబాద్ ఎర్రగడ్డలో మాధవీ ఉదంతం జరిగింది. ఈ ఘటనలతో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు భయపడి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు రక్షణ కల్పించండని వేడుకుంటున్నారు. తాజాగా అటువంటి ఘటనే హైదరాబాద్ బషీర్ బాగ్ లో జరిగింది.

తన భార్యతో రాజు

బషీర్ బాగ్ కు చెందిన రాజు అనే యువకుడు వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి బంధువులు  అంతు చూస్తామని బెదిరిస్తున్నారని రాజు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లారని వాపోయాడు.

తన భార్యను అన్యాయంగా తన నుండి దూరం చేశారని, ఎట్టి పరిస్థితిలోను తన భార్య తనకు కావాలని రాజు మీడియా ముందు మొర పెట్టుకున్నాడు. అమ్మాయి కుటుంబం నుండి తనకు ప్రాణ హాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు.