భార్య ప్రియుడితో కలిసి బెడ్రూంలో ఉండగా చూసిన భర్త… చివరికి ఏం చేశాడంటే

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భర్త ప్రియురాలితో, భార్య ప్రియునితో ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మరి కొందరు ఏకంగా చంపేస్తున్నారు. దీంతో రోజుకో హత్య వెలుగు చూస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో భార్య ప్రియునితో బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్ గా భర్తకు దొరికింది. దీంతో మనస్థాపానికి గురైన భర్త… భార్యను ఏం చేయలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతపురం జిల్లా రొళ్ల వడ్రహట్టి గ్రామానికి చెందిన నాగరాజుకు అదే గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. యువతిది అదే గ్రామం కావడంతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తితో ఉన్న సంబంధం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో నాగరాజు ఇంట్లో లేనప్పుడు ఏకంగా ఆ వ్యక్తి ఇంట్లోకి వచ్చే కలిసేవాడు.

గత కొద్ది రోజుల క్రితం ఈ విషయం నాగరాజుకు తెలియడంతో మందలించాడు. అటువంటిది ఏం లేదని చెప్పి కొంత కాలం ప్రియుడికి దూరంగా ఉంది. అయినా ప్రియుని మీద మనసు చావకపోవడంతో అప్పుడప్పుడు దొంగ చాటుగా కలిసేది. ఈ క్రమంలో భార్య బెడ్రూంలో ప్రియుడితో కలిసి ఉండగా నాగరాజు చూశాడు. దీంతో కోపంతో అరవగా ప్రియుడు పారిపోయాడు. భార్యను ఏం చేయలేక నాగరాజు ఇంటి నుంచి వెళ్లి పోయాడు.

ఆ తర్వాత ఒక రోజుకు నాగరాజు ఇందిరమ్మ కాలనీలోని చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేకే చనిపోయాడని నాగరాజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.